Skip to main content

Posts

అమూల్ వివాదం : పాల రాజకీయం

  మొన్న కర్ణాటక లో "కర్ణాటక మిల్క్ ఫెడరేషన్"  ను  "గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్" ను విలీనం చేయాలనీ ప్రయత్నాలు చేసింది బిజెపి ప్రభుత్వం. కానీ అక్కడ ప్రతిపక్షాలు, రైతులు నుండి తీవ్ర నిరసన రావడం తో వెనక్కి తగ్గింది. ఇప్పుడు తమిళనాడు వంతు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈరోజు కేంద్ర మంత్రి అమితాషా కు లేఖ రాశారు. తమిళనాడు లో అమూల్ పాల సేకరణ వలన తలెత్తుతున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లారు. అసలు ఈ అమూల్ వివాదం ఏంటి? అనేది తెలుసుకోవాలి అంటే మనము ముందుగా గత సంవత్సరం డిసెంబర్ నెలలో అమిత్ షా చేసిన ప్రకటన తెలుసుకోవాలి. కేంద్ర హోం మంత్రి మరియు సహకార శాఖ మొదటి మంత్రి అమిత్ షా “అమూల్ (గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్) ను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కలిసి కర్నాటకలోని ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక డెయిరీని నెలకొల్పేందుకు కృషి చేస్తాయని ప్రకటించడంతో వివాదం మొదలైంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని పేరుతో పాలను విక్రయస్తుంది. అమూల్ ను నందిని తో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. కర్ణాటక లో ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా
Recent posts

అక్కడ ఆలా ఇక్కడ ఇలా!

 తెలంగాణ  ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది. జూన్ 2 వతేది నుండి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపోందించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు ఉండబోతున్నాయి. అన్ని రంగాలలో సాధించిన ప్రగతి ని పల్లె పల్లె లో ప్రజలను భాగస్వాములు చేస్తూ సంబురాలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఈ తొమ్మిది ఏండ్ల లో సాధించిన ప్రగతి కి చిహ్నం గా ఈ దశాబ్ది ఉత్సవాలు ఉండనున్నాయి. ఒక పక్క ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు కు ఏర్పాట్లు చేస్తుంటే ప్రతి పక్షాలు మొసలి కన్నీరు కార్చడం ప్రారంభించాయి. భారతీయ జనతా పార్టీ ఈ దశాబ్ది ఉత్సవాలు వలన భారత రాష్ట్ర సమితి కి రాజకీయ లబ్ది చేకూరుతుంది అని, ప్రజాధనం వృధా అయిపోతుంది అని విమర్శలు చేస్తూ ఉంది. ఆత్మగౌరవానికి కోసం ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పదవ వసంతం లోకి అడుగుపెడుతున్న వేళ సంబురాలు చేసుకోవడం తప్పేముంది.  ఒకవేళ ఈ సంబురాలు వలన భారతీయ రాష్ట్ర సమితి కి రాజకీయ లబ్ది చేకూరుతుంది అనుకుంటే అది ఎందుకు చేకూరుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ దశాబ్ది ఉత్సవాలా

లక్ష్యానికి చేరువలో కంటి వెలుగు

  ఏ ప్రభుత్వానికి అయిన ప్రాధమిక లక్ష్యం ప్రజా ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సు.   వీటిని ప్రజలకు అందించిన ప్రభుత్వాలు  ప్రజలు మనసు దోచుకో గలుగుతాయి. పది కాలాలు పాటు పరిపాలించగలుగుతాయి. ఆలా పరిపాలన అందించిన నాయకులు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తారు. ఇది నగ్న సత్యం.  దేశం లో ఎక్కడా లేని విధంగా గా వినూత్న రీతిలో సంక్షేమ పధకాలు చేపట్టడం లో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంటుంది.  ప్రజా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టే పధకాలు కేవలం అరంభ సూరత్వం గా కాకుండా వాటి ఫలితాలు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ చేరాలి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ర్ ఆలోచన తో రాష్ట్రం లో ఎన్నో పధకాలు చిగురించి వికసిస్తూ ఉన్నాయి. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అనే మాట మనకందరికీ తెలిసిందే. అంటే అన్ని ఇంద్రియాలలో కళ్ళు ఎంతో ముఖ్యమైనవి. దీనిని ద్రుష్టి లో పెట్టుకుని రాష్ట్రం లో ఆంధత్వం అనేది లేకుండా చేయాలి అనే లక్ష్యం తో ప్రజల్లోకి తీసుకుని వచ్చిన పధకం కంటి వెలుగు. ఇప్పటిదాకా ఈ పధకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. కంటి సమస్యలు ఉన్నవారిని పరీక్ష చేయడం, అవసరమైన వారికి కంటి అద్దాల పంపిణీ, కంటి ఆపరేషన్లు నిర్వహణ, కంటి సమస్యలు రాకుండా  అవసరమైన మందుల ప

నోట్లరద్దు సామాన్యునికి మేలా?

   బిడ్డ పెళ్లికోసం యాదగిరి 6 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకున్నాడు. 2016 నవంబర్ 18 న అప్పటికప్పుడు    500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తో తీవ్ర ఒత్తిడి కి గురయ్యాడు. తన దగ్గర ఉన్న నోట్ల ను మార్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు లు పడ్డాడు.  నోట్ల రద్దు తో సామాన్యులు ఎదురుకున్న ఇబ్బందులకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పిల్లల పురుడు కోసం, ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు దగ్గర ఉంచుకున్న ఎంతోమంది ఇలా ఇబ్బందులు పడ్డారు.  నోట్ల రద్దు సామాన్యునికి మేలా?  2016 నవంబర్ 18 న కేంద్రం ప్రభుత్వం చేసిన నోట్ల రద్దు ప్రకటన భారత ఆర్ధిక వ్యవస్థ ను అతలాకుతలం చేసింది. చెలామణి లో ఉన్న 500,1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు హడావిడిగా RBI ప్రకటించింది. అప్పుడే 2000 రూపాయల నోట్లు ను చెలామణి లోకి కొత్తగా తెస్తున్నట్లు కేంద్రం లో అధికారం లో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ఆ నిర్ణయాన్ని దేశం లో ని చాలా మంది ఆర్ధిక వేత్తలు, మేధావులు, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీ లు తీవ్రంగా వ్యతిరేకించాయి.  కానీ బిజెపి ప్రభుత్వం దేశం లోని అవినీతి ని కట్టడి చేయాలన్నా , నల్ల ధనాన్ని రూపుమాపాల

తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందా

  "కె సి ఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి"  అని తెలంగాణ పి సి సి అధ్యక్షుడు రేవంతరెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రం లో కాంగ్రెస్ ను అధికారం లోకి తీసుకుని రావాలని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత రేవంత్ రెడ్డి నోటి వెంట ఇటువంటి మాటలు రావడం లో ఆశ్చర్యం ఏమీ లేదు. తెలంగాణ లో కూడా అధికారం లోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ కు కర్ణాటక ఫలితాలు కొత్త ఆశలు పుట్టించాయి.  కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే రేవంత్ మాటలు కానీ, తెలంగాణ కాంగ్రెస్ ఆశలు కానీ గాలి లో మేడలు కట్టినట్టే అని అర్ధమవుతుంది. కర్ణాటక లో కాంగ్రెస్ గెలవడానికి అక్కడ అనేక అంశాలు దోహదం చేసాయి. ఆ పరిస్థితులు తెలంగాణ లో లేవు. అక్కడ అధికారం లో ఉన్న బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పై వచ్చిన 40 శాతం కమీషన్ ఆరోపణలు ప్రజలను ఆలోచింప చేసాయి. మరోపక్క ధరల పెరుగుదల, బిజెపి చేసే మత తత్వ రాజకీయాలకు విసుగు చెందిన ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు.  హలాల్, హిజాబ్, అజాన్‌తోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత ‘బజరంగ్ దళ్’ అంశాన్ని కూడా బిజెపి రాజకీయాస్త్రంగా వాడుకుని లబ్ది పొందాలి అని చూసింది కానీ ఇవన్న

కలవర పెడుతున్న పరిశోధనా ఫలితాలు

  పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడుతుంటే చిన్న తనం లోనే అన్ని నేర్చుకుంటున్నారు అని మురిసిపోతున్నాం. మా వాడు ఫోన్ లో అన్ని ఆపరేట్ చేయడం నేర్చుకున్నాడు అని అబ్బుర పడుతున్నాం. ఫోన్ లో ఫలానా రైమ్స్ చూడకుండా ముద్ద కూడా ముట్టడు అని మురిసి పోతూ చెప్పుకుంటున్నాం. కానీ పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడితే వచ్చే దుష్ప్రభావాలు గురించి మర్చిపోతున్నాం. పిల్లలకు సెలవులు దొరికితే ఫోన్ పట్టుకునే కుర్చుంటున్నారు. స్కూల్ నుండి రాగానే కూడా అదే పని. తెల్లవారింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ లేకపోతే గడవడం లేదు. చాలా మంది పిల్లలు  చేతిలో 24 గంటలు మొబైల్ ఫోన్స్ దర్శనం ఇస్తూ ఉన్నాయి.పిల్లలు చిన్న వయసు లో స్మార్ట్ ఫోన్స్ కు ఏ విధంగా బానిసలుగా మారుతున్నారో మనకు తెలిసిందే. పెద్దల మాట ఎలా ఉన్న పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడకం పై వైద్యులు ఎప్పటి నుండో హెచ్చరిస్తూ ఉన్నారు. పిల్లలు కు కంటి సమస్యలు చిన్నతనం నుండే మొదలు అవుతాయి అని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఐతే తాజాగా పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడడం పై సేపియన్ లాబ్స్ అనే సంస్థ విడుదల చేసిన పరిశోధనా ఫలితాలు  కొత్త విషయాలు తెలియచేస్తున్నాయి. పిల్లలు చిన్న తనం నుండే స్మార్ట

రైతు పక్షపాతి కె సి ఆర్

  తెలంగాణ పదవ వసంతం లోకి అడుగు పెడుతూ ఉంది . దేశం లో కొత్తగా ఏర్పాటు అయిన ఒక రాష్ట్రం ఇంత తక్కువ సమయం లో అభివృద్ది లో దేశానికి రోల్ మోడల్ గా నిలవడం అంటే సామాన్యమైన అంశం కాదు.  దీని వెనుక ముఖ్యమంత్రి కే సి ఆర్ ముందు చూపు, అకుంటిత దీక్ష స్పష్టంగా కనిపిస్తాయి. ఒక సమర్ధవంతమైన నాయకుడు ఉంటే ఫలితాలు, అభివృధి ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశానికి తెలంగాణ ఒక ఉదాహరణ. ముఖ్యమంత్రి కె సి ఆర్ రైతు పక్షపాతి. తెలంగాణా రాష్ట్రం లోకి అధికారం లోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రాన్ని ఏవిధంగా సస్యశ్యామలం చేయాలి? బీడు భూముల లో ఏ విధంగా బంగారం పండించాలి? రైతు మోము లో ఎల్లప్పుడూ అనందం ఎలా తీసుకురావాలి అనే ఆలోచన తోనే ముందు అడుగు వేశారు. వ్యవసాయ రంగం పై ప్రత్యేక ద్రుష్టి పెట్టి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పధకాలు లో  వ్యవసాయానికి, రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ కు కీర్తికిరీటం గా నిలిచేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టి  బీడువారిన భూములను సస్య శ్యామలం చేశారు. ఒక్క ప్రాజెక్టు తో గోదావరి నీటిని తెలంగాణ లో 13 జిల్లాలకు సాగు నీటి కష్టాలు దూరమయ్యేలా, హైదరాబాద్ కు 30 టి ఏం సి ల తాగు నీరు చేర