Skip to main content

మార్గదర్శి ఇదీ చరిత్ర

 మార్గదర్శి అంటే నమ్మకానికి మారుపేరుగా తీర్చి దిద్దారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి ప్రారంభం చేసినపుడు చిటఫండ్స్ కు ఆదరణ లేదు. కానీ ముందుచూపుతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ను ప్రారంభం చేసి దానిని 60 ఏళ్ళు గా విజయపధం లో నడిపిస్తున్నారు రామోజీరావు. 


మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్  అనే పేరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకునే పేరు. తెలుగు కుటుంబాల ఆర్ధిక ప్రణాళిక లో భాగం అయిన పేరు. ఎంతో మంది ఆర్ధిక విజయాలకు బాట వేసిన పేరు. ఎంతో మంది వ్యాపారస్తులకు ఆర్ధిక అలంబన అయిన పేరు. ప్రజలతో నిజాయితీ గా మమేకం అవ్వడమే ఈ విజయానికి కారణం. 


తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ లు వెలిసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక బోర్డు తిప్పేసిన కధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక క్రమ శిక్షణతో ఖాతా దారుల నమ్మకాన్ని నిలబెడుతూ  60 ఏళ్లుగా ఒక్కక్క మెట్టు ఎక్కుతూ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేసిన చిట్ ఫండ్ సంస్థ ఒక్క మార్గదర్శి అని చెప్పవచ్చు.


చెరుకూరి రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్శి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు తో ప్రారంభం అయ్యింది.

మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రామోజీ గ్రూప్ లో ఒకటిగా నిర్వహింపబడుతూ ఉంది. రామోజీ రావు ప్రారంభించిన ఏ సంస్థ అయినా ఒక చక్కని ప్రణాళిక తో ముందుకు వెళ్తూ ఉంటాయి. దానికి ఉదాహరణ ఈనాడు దినపత్రిక, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు  ఇతర వ్యాపారాలు.


చిట్ ఫండ్ వ్యవస్థను ఇంతకు ముందెన్నడూ ఎవ్వరూ చేయని విధంగా రాష్ట్రంలో చిట్ ఫండ్ వ్యాపారానికి  మార్గదర్శకత్వం వహించిన ఘనత మార్గదర్శి సంస్థకు దక్కుతుంది.మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రామోజీరావు, శైలజాకిరణ్ చెరుకూరి.


ఒకప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది.  కానీ అంచెలు అంచెలు గా ఎదుగుతూ పక్క రాష్ట్రాలు అయిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా విజయవంతం గా నడపబడుతూ ఉంది.


ఒక్కో సంవత్సరం ఖాతా దారులను పెంచుకుంటూ   ఒక ప్రసిద్ధ చిట్ ఫండ్ సంస్థ గా మార్గదర్శి చిట్ ఫండ్ జనాదరణ పొందింది.


ప్రజలు ఆదా చేయడానికి లాభదాయకంగా,  సులభం గా ఆకస్మిక పరిస్థితులను తీర్చడానికి అనువైన మార్గంగా ఉండడమే కాకుండా ప్రజల సొమ్ముకు కాపలాదారుగా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వలన ప్రజలకు చాలా తక్కువ సమయంలో దగ్గరైంది.

 మార్గదర్సి విలువలు, పనితీరు, నిజాయితీ, వృత్తిపరమైన సమగ్రత, అధిక నాణ్యత గల సేవలు, సంపూర్ణ ఆర్థిక క్రమశిక్షణ దాని నాయకత్వ స్థానాన్ని నిలుపుకోవడంలో అడుగుడుగునా సహాయపడ్డాయి.


మార్గదర్శి సంవత్సరాలుగా ఊహించని రీతిలో వృద్ధిని సాధిస్తూ ఉంది.  4,300 మంది ఉద్యోగులు, 16015 మంది ఏజెంట్లు  తో 108 బ్రాంచీలు గా విస్తరించి సేవలు అందిస్తూ ఉంది. 


పేద , మధ్యతరగతి, చిన్న పరిశ్రమల వారికి ఎంతో ప్రయోజనకరంగా  తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో విజయవంతం గా నడుస్తున్న సంస్థ మార్గదర్శి. 


సంస్థ ఎదుగుదలలో ఎన్నో రాజకీయ ఒత్తిడి లు ఎదురుకున్నా ఖాతాదారుల శ్రేయస్సు నే లక్ష్యం గా పెట్టుకుని ముందుకు వెళ్తున్న సంస్థ మార్గదర్శి మాత్రమే. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఏరోజు ఒక్క ఖాతా దారుడు నుండి సేవా లోపం ఉంది అని ఒక్క పిర్యాదు రాకపోవడం దీనికి నిదర్శనం.





Comments

Popular posts from this blog

నిత్యానందుడు కైలాశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా?

  Swamy nityananda united states of kailasa : అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసుల్లో ఇరుక్కుని మన దేశం విడిచి పారిపోయిన దేవుడు స్వామి  నిత్యానంద. తమిళనాడు కు చెందిన ఈ నిత్యానంద ఇక్కడ చేయని తప్పులు లేవు. ప్రముఖులు తో పరిచయాలు ను ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు కేసులు ఎదుర్కొన్నాడు. ఈ నిత్యానంద స్వామి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లే సమయానికి దేశంవిడిచి జంప్.  తానే దేవుడు అని ప్రకటించుకుని, తప్పులు చేసి కేసుల పెట్టాకా రాత్రి కి రాత్రి దేశం విడిచి పారిపోయాడు.  అమెరికాలో ఎక్కడో ఒక దీవి ని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. కైలాసం ఒక స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు స్వామి నిత్యానంద.  సొంత కరెన్సీ, జాతీయ పతాకం కూడా ప్రకటించుకున్నాడు. … ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు.  కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ స్వామి నిత్యానంద దేశానికి ఓ దేశం గా గుర్తింపు ఇచ్చింది. ఎందుకు గుర్తించింది? అసలు ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఈ కైలాస దేశాని ఉన్నాయా లేదా? అనేది కూడా చూడకుండానే గుర్తించింది.  ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద. హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల,

మీ హృదయం పదిలం

  మీ గుండె మీ శరీరంలో అత్యంత ముఖ్యమైన కండరం. ఎక్కువ కాలం ఆరోగ్య ఉండాలి అంటే,  ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి అంటే గుండె ఆరోగ్యం గా ఉండడం ఎంతో అవసరం.  మీ హృదయాన్ని పది కాలాలు పాటు పదిలంగా ఉంచుకోవాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలు ఈ వ్యాసం లో చూద్దాము. హృదయం : పదికాలాలు పదిలం  క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: మీ గుండె ఆరోగ్యం కోసం  క్రమం తప్పకుండా  వ్యాయామం చేయండి. శరీరానికి శ్రమ అవసరం.  వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయాలి అని లక్ష్యంగా పెట్టుకోండి. దీన్ని వారంలో చిన్న  చిన్న బాగాలుగా చేసి వారం పూర్తి అయ్యేసరికి పూర్తి చేయండి. ఆరోగ్యకరమైన ఆహరం : గుండె-ఆరోగ్యం కోసం ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోండి. . ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక మొత్తంలో చక్కెర మరియు ఉప్పు లను దూరంగా ఉంచండి. దూమపానా నికి దూరంగా ఉండండి : పొగతాగే అలవాటు ఉన్నవారికి గుండె సంబంధ వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గుండె ను ఆరోగ్యం గా ఉంచుకోవాలి అనుకుంటే దూమపానానికి దూరంగా ఉండండి.  ఒత్తిడి కి

Guava leafs : పండే కాదు ఆకులు కూడా ఆరోగ్య సంజీవనే!

జామ పండు రుచి నచ్చని వారు ఎవరూ ఉండరేమో! జామ పండు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.  అయితే, జామ చెట్టు ఆకులు కూడా మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని మీకు తెలుసా? జామ ఆకులలో (Guava leafs)అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా మెరుగుపరుస్తాయి. ఈ వ్యాసం లో  జామ ఆకుల (Guava leafs health benifits )వల్ల కలిగే ప్రయోజనాలను,  జామ ఆకులను  నిత్యం ఏవిధంగా వాడుకోవచ్చో తెలుసుకుందాం. Guava Leafs Health Benifits  రోగనిరోధక శక్తిని పెంచుతుంది జామ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.  ఇది హానికరమైన వ్యాధికారక,  ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. జామ ఆకు టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  వివిధ వ్యాధులు నివారణలో సహాయపడుతుంది.  జీర్ణక్రియలో సహకరిస్తుంది జామ ఆకులలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుం