Skip to main content

విజయసాయి రెడ్డి చంద్రబాబు ప్రేమలో పడ్డారా! వలలో పడ్డారా?

 ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వై ఎస్ ఆర్ సి పి పార్టీ శ్రేణులలో కలకలం రేపింది. దానికి కారణం వై ఎస్ ఆర్ సీపీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయడమే.

Vijayasai reddy tweet 


వై ఎస్ ఆర్ సీపీ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి పార్టీ లో ఎంతో కీలకమైన వ్యక్తి. పార్టీ ప్రారంభం నుండి జగన్ వెంటే ఉండి పార్టీ ని పటిష్టం చేయడానికి ఎంతో కృషి చేశారు.

జగన్ తీసుకునే నిర్ణయాలు ను, పధకాలును ప్రజలకు చేరవేయడం లో కీలక పాత్ర వహించేవారు. ప్రతి పక్షాలు విమర్శలకు ఘాటు గా సమాధానం ఇచ్చేవారు. ముఖ్యం గా ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలకు తనదైన శైలి లో సమాధానం ఇచ్చేవారు. 


ప్రతీ ఏడాది చంద్రబాబు పుట్టిన రోజున తన ట్విట్టర్ ద్వారా వ్యగ్యం గా పుట్టున రోజు శుభాకాంక్షలు చెప్పేవారు.

గత కొంతకాలం గా విజయ సాయి రెడ్డి  చాలా సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు గురించి  ప్రకటనలు,  అభిప్రాయాలు చాలా తక్కువ గా చేస్తున్నారు. 

మరీ ముఖ్యం గా నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన సైలెంట్ అయ్యిపోయారు. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు చంద్రబాబు తో, బాలకృష్ణ తో కలిశారు విజయసాయి రెడ్డి.  ఆ తర్వాత ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు నా శుభాకాంక్షలు తెలియచేసారు. అది కూడా చాలా చాలా గౌరవం గా. ప్రతిపక్ష నాయకుడి కి శుభాకాంక్షలు చెప్పడం తప్పు ఏమీ కాదు. కానీ గత సవంత్సరం శుభాకాంక్షలకు ఈ సవంత్సరం శుభాకాంక్షలకు ఎంత తేడా!! అని పార్టీ అభిమానులు గుసగుసలు లాడుకుంటున్నారు. 

 రాష్ట్రం లో తెలుగుదేశం, వైస్సార్ సీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనేలా ప్రతీ రోజు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటున్నాయి. ప్రతీ రోజు చంద్రబాబు సభలు పెట్టి జగన్ పై, ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. నిన్నటి కి నిన్న తెలుగుదేశం నాయకురాలు వంగలపూడి అనిత జగన్ పై తీవ్ర విమర్శలు చేసింది. మరో పక్క రామోజీ మార్గదర్శి పై సిబిఐ విచారణ కొనసాగుతూ ఉంది. ఇవ్వన్నీ ఇలా ఉండగా ఈ అంశాలు లో తెలుగుదేశం పై గాని, చంద్రబాబు పై గాని ఒక్కమాట కూడా విజయసాయి రెడ్డి మాట్లాడలేదు. కానీ చంద్రబాబు పుట్టిన రోజు కు మాత్రం ప్రేమ కురిపిస్తూ శుభాకాంక్షలు  తెలియచేసారు.


విజయసాయి రెడ్డి చంద్రబాబు ప్రేమలో పడ్డారా? లేక బాబు వేసే రాజకీయ ఎత్తుగడలకు లొంగిపోయారా? అని పార్టీ అభిమానులు చర్చించు కుంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్ పై విమర్శలు చేస్తూ ఉన్నా విజయసాయి రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.


ఈ అంశం పై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!

సడన్ గా విజయసాయి రెడ్డి లో వచ్చిన ఈ మార్పు పై పార్టీ అభిమానులు వివిధ రకాలుగా చర్చ ఇంచుకుంటున్నారు. ఈ శుభాకాంక్షలు లు ను విజయసాయి రెడ్డి చంద్రబాబు బాబు కు దగ్గర అవుతున్నట్టు గా భావించాలా? లేక చంద్రబాబు వలలో విజయసాయి రెడ్డి చిక్కు కున్నట్టు అనుకోవాలా అని పార్టీ అభిమానులు ఆలోచనలో పడ్డారు.  విజయసాయి రెడ్డి మనసులో మాట ఏమిటి అనేది ఆయన నోరు విప్పి చెప్తేనే తెలుస్తుంది. 




Comments

Popular posts from this blog

నిత్యానందుడు కైలాశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా?

  Swamy nityananda united states of kailasa : అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసుల్లో ఇరుక్కుని మన దేశం విడిచి పారిపోయిన దేవుడు స్వామి  నిత్యానంద. తమిళనాడు కు చెందిన ఈ నిత్యానంద ఇక్కడ చేయని తప్పులు లేవు. ప్రముఖులు తో పరిచయాలు ను ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు కేసులు ఎదుర్కొన్నాడు. ఈ నిత్యానంద స్వామి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లే సమయానికి దేశంవిడిచి జంప్.  తానే దేవుడు అని ప్రకటించుకుని, తప్పులు చేసి కేసుల పెట్టాకా రాత్రి కి రాత్రి దేశం విడిచి పారిపోయాడు.  అమెరికాలో ఎక్కడో ఒక దీవి ని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. కైలాసం ఒక స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు స్వామి నిత్యానంద.  సొంత కరెన్సీ, జాతీయ పతాకం కూడా ప్రకటించుకున్నాడు. … ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు.  కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ స్వామి నిత్యానంద దేశానికి ఓ దేశం గా గుర్తింపు ఇచ్చింది. ఎందుకు గుర్తించింది? అసలు ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఈ కైలాస దేశాని ఉన్నాయా లేదా? అనేది కూడా చూడకుండానే గుర్తించింది.  ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద. హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల,

తప్పు ఎవరిది?

 విధ్యారంగం లో అద్భుతమైన అభివృద్ది. ప్రతీ ఏడాది గొప్ప గొప్ప ఫలితాలు. 100% పాస్ అయిన స్కూల్స్ ఎన్నో. చాలా మంచి విషయమే. కానీ ఇది అంతా నాణానికి ఒకవైపే. మరోపక్క తల్లి తండ్రులకు, విధ్యార్థులు కు వస్తున్న మార్కులతో, పెర్సంటేజ్ లతో సంతృప్తి ఉండడం లేదు. 9.9 వచ్చిన విధ్యార్థులు, తల్లి తండ్రులు కూడా అసంతృప్తి తో రగిలి పోతున్నారు. మార్కులు ఒక్కటే జీవితం కాదు  ఈ ఏడాది ఈ అసంతృప్తి కి లోనై  బలవంతం గా ప్రాణాలు తీసుకున్న విధ్యార్థులు ఎంతో మంది ఉన్నారు. పరీక్షలలో సరైన మార్కులు రాలేదని, పక్కవాడి కంటే తక్కువ వచ్చాయి అని, పరీక్షలలో ఫెయిల్ అయ్యామని,  తక్కువ మార్కుల వలన తల్లితండ్రులు మందలించారు అని ఇలా కారణం ఏదైనా కానీ ఫలితం మాత్రం బలవంతపు మరణమే. కుమారుడు కు పదవ తరగతి ఫలితాలు లో 9.5 వచ్చి నా,  తల్లి మొహం లో విచారం చూసి ధైర్యం చెప్పి , ఐనా మంచి మార్కులే వచ్చాయి కదా అని అంటే,  ఏమి మంచి మా చిన్నప్పటి చదువులు కాదు కదా 10/10 రావాలి అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అంతే కాదు మా బందువులలో చాలా మందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయి అని కుమిలి కుమిలి బాధ పడింది. ఆ తల్లి బాధ చూసి తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్

మార్గదర్శి ఇదీ చరిత్ర

 మార్గదర్శి అంటే నమ్మకానికి మారుపేరుగా తీర్చి దిద్దారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి ప్రారంభం చేసినపుడు చిటఫండ్స్ కు ఆదరణ లేదు. కానీ ముందుచూపుతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ను ప్రారంభం చేసి దానిని 60 ఏళ్ళు గా విజయపధం లో నడిపిస్తున్నారు రామోజీరావు.  మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్  అనే పేరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకునే పేరు. తెలుగు కుటుంబాల ఆర్ధిక ప్రణాళిక లో భాగం అయిన పేరు. ఎంతో మంది ఆర్ధిక విజయాలకు బాట వేసిన పేరు. ఎంతో మంది వ్యాపారస్తులకు ఆర్ధిక అలంబన అయిన పేరు. ప్రజలతో నిజాయితీ గా మమేకం అవ్వడమే ఈ విజయానికి కారణం.  తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ లు వెలిసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక బోర్డు తిప్పేసిన కధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక క్రమ శిక్షణతో ఖాతా దారుల నమ్మకాన్ని నిలబెడుతూ  60 ఏళ్లుగా ఒక్కక్క మెట్టు ఎక్కుతూ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేసిన చిట్ ఫండ్ సంస్థ ఒక్క మార్గదర్శి అని చెప్పవచ్చు. చెరుకూరి రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్శి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు తో ప్రారంభం అయ్యింది.