తెలంగాణ పదవ వసంతం లోకి అడుగు పెడుతూ ఉంది . దేశం లో కొత్తగా ఏర్పాటు అయిన ఒక రాష్ట్రం ఇంత తక్కువ సమయం లో అభివృద్ది లో దేశానికి రోల్ మోడల్ గా నిలవడం అంటే సామాన్యమైన అంశం కాదు. దీని వెనుక ముఖ్యమంత్రి కే సి ఆర్ ముందు చూపు, అకుంటిత దీక్ష స్పష్టంగా కనిపిస్తాయి. ఒక సమర్ధవంతమైన నాయకుడు ఉంటే ఫలితాలు, అభివృధి ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశానికి తెలంగాణ ఒక ఉదాహరణ.
ముఖ్యమంత్రి కె సి ఆర్ రైతు పక్షపాతి. తెలంగాణా రాష్ట్రం లోకి అధికారం లోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రాన్ని ఏవిధంగా సస్యశ్యామలం చేయాలి? బీడు భూముల లో ఏ విధంగా బంగారం పండించాలి? రైతు మోము లో ఎల్లప్పుడూ అనందం ఎలా తీసుకురావాలి అనే ఆలోచన తోనే ముందు అడుగు వేశారు. వ్యవసాయ రంగం పై ప్రత్యేక ద్రుష్టి పెట్టి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పధకాలు లో వ్యవసాయానికి, రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు.
తెలంగాణ కు కీర్తికిరీటం గా నిలిచేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టి బీడువారిన భూములను సస్య శ్యామలం చేశారు. ఒక్క ప్రాజెక్టు తో గోదావరి నీటిని తెలంగాణ లో 13 జిల్లాలకు సాగు నీటి కష్టాలు దూరమయ్యేలా, హైదరాబాద్ కు 30 టి ఏం సి ల తాగు నీరు చేరేలా చేశారు. గోదావరి నది నీటిని దిగువ నుండి ఎగువకు పంపింగ్ చేసి నిర్మించిన ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ప్రపంచం లో ఎక్కడా నిర్మించ బడలేదు.
రాష్ట్రం లోని చెరువులు, కుంటలు, ఇంకుడు చెరువులు ,పునర్జీవింప చేయడానికి మిషన్ కాకతీయ కార్యక్రమం అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
రైతులు వ్యసాయ పెట్టుబడులకు ఇబ్బందులు పడకూడదని పెట్టుబడి సాయం గా ఎకరాకు 10000 ఆర్ధిక సహాయాన్ని అందించే రైతు బందు పధకాన్ని ప్రవేశ పెట్టారు. సంవత్సరానికి రెండు విడతలుగా ఈ సాయం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తూ ఉన్నారు.
రైతులకు 5లక్షల భీమా సౌకర్యం ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ ఉంది. రైతులు ఒక్కరూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా రైతుల తరుపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ ఈ పధకాన్ని అందుబాటులో కి తీసుకుని వచ్చింది.అంతే కాకుండా పంటల భీమా ను కూడా అమలు చేస్తూ ఉన్నది. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ కార్యక్రమాలు అమలు పరుస్తూ రైతు కు వెన్నుముఖ గా నిలుస్తూ ఉంది. దేశం లో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ను అందిస్తూ వస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే.
రైతుల కోసం అదునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఉత్పత్తి పెరిగేలా ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతీ గ్రామంలో రైతులకు సబ్సిడీ ద్వారా విత్తనాలు అందించడం తో పాటు , ఆధునాతన వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉండేలా చేయడమే కాకుండా, వాటిని వాడడం కోసం రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది . అదునాతన యంత్రాల కొనుగోలు లో సబ్సిడీ లు అందించడం ద్వారా రైతు కు అడుగు అడుగు నా తోడ్పాటు అందించింది తెలంగాణ ప్రభుత్వం. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు రైతు బాజార్లు ద్వారా అమ్ముకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం, దళారుల పాత్ర ను రూపుమాపడం లో తెలంగాణా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. రైతుబందు సమితులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు వారి సమస్య ను గ్రామాలలో నే పరిష్కరించుకునేలా ఏర్పాట్లు చేసింది.
ఏ రాష్ట్రం లో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంచార పశు వైద్య శాలలు ఏర్పాటు చేసింది. దీనిద్వారా 100 అంబులెన్సు ల ద్వారా పశువులకు వైద్యం అందిస్తూ వస్తున్నది. వ్యవసాయ ట్రాక్టర్లపై పన్ను రద్దు చేయడం, రైతులకు డ్రిప్ సిస్టం కొనుగోలు లో సబ్సిడీ లు అందివ్వడం, రైతులు పంటలను అరబెట్టుకోవడానికి కల్లాల నిర్మాణం గావించింది. నీటి తీరువా పన్ను ను రద్దు చేసింది. ఒకటి అని కాదు చెప్పుకుంటూ పొతే తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రైతు క్షేమం కోసం ముడిపడే ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వ ఈ పధకాలు, నిర్ణయాలు చూసే దేశం లోని ప్రజలు కె సి ఆర్ లాంటి నాయకుడు కావాలని ఆలోచిస్తున్నారు.
రైతు సంక్షేమం కోరుకునే నాయకులు ఉన్నంత వరకు రాష్ట్రం అయిన , దేశం అయిన ఎప్పుడూ సస్యశ్యామలం గానే ఉంటాయి .
దేశం లో సాగు నీటి సమస్య ను, తాగు నీటి సమస్య ను ఎలా పరిష్కరించాలి అనే ప్రణాళిక ఇప్పటికె కెసిఆర్ ఆలోచనలలో ఉంది. స్వాతత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా దేశం లో రైతు కోసం చిత్త శుద్ధితో పనిచేసిన ప్రభుత్వాలు లేవు.దేశం లో ఎన్నో వనరులు సమృద్ధి గా ఉన్నా వాటిని సరి అయిన విధంగా ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. సరి అయిన ప్రణాళిక తో ముందుకు నడిపించగల నాయకుల కొరత ఇక్కడే స్పష్టంగా కనపడుతూ ఉంది.
అందుకే ఇప్పుడు దేశం లో ప్రజలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారు. ఇటువంటి ఆలోచనలు ఉన్న సమర్ధుడు అయిన నాయకుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితి గా ప్రకటించినపుడు దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులు కె సి ఆర్ కు మద్దతుగా నిలిచారు. త్వరలోనే దేశం లోని రైతులకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. దేశం అభివృద్ధికి రాజకీయాలు అడ్డురాకూడదు అంటూ ఎప్పుడూ చెప్పే కె సి ఆర్ లాంటి సమర్ధవంతమైన ముందు చూపు ఉన్న నాయకుడు ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం.
- తటవర్తి భద్రిరాజు
9493388940
Comments
Post a Comment