Skip to main content

కలవర పెడుతున్న పరిశోధనా ఫలితాలు

 


పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడుతుంటే చిన్న తనం లోనే అన్ని నేర్చుకుంటున్నారు అని మురిసిపోతున్నాం. మా వాడు ఫోన్ లో అన్ని ఆపరేట్ చేయడం నేర్చుకున్నాడు అని అబ్బుర పడుతున్నాం. ఫోన్ లో ఫలానా రైమ్స్ చూడకుండా ముద్ద కూడా ముట్టడు అని మురిసి పోతూ చెప్పుకుంటున్నాం. కానీ పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడితే వచ్చే దుష్ప్రభావాలు గురించి మర్చిపోతున్నాం.


పిల్లలకు సెలవులు దొరికితే ఫోన్ పట్టుకునే కుర్చుంటున్నారు. స్కూల్ నుండి రాగానే కూడా అదే పని. తెల్లవారింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ లేకపోతే గడవడం లేదు. చాలా మంది పిల్లలు  చేతిలో 24 గంటలు మొబైల్ ఫోన్స్ దర్శనం ఇస్తూ ఉన్నాయి.పిల్లలు చిన్న వయసు లో స్మార్ట్ ఫోన్స్ కు ఏ విధంగా బానిసలుగా మారుతున్నారో మనకు తెలిసిందే.



పెద్దల మాట ఎలా ఉన్న పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడకం పై వైద్యులు ఎప్పటి నుండో హెచ్చరిస్తూ ఉన్నారు. పిల్లలు కు కంటి సమస్యలు చిన్నతనం నుండే మొదలు అవుతాయి అని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఐతే తాజాగా పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడడం పై సేపియన్ లాబ్స్ అనే సంస్థ విడుదల చేసిన పరిశోధనా ఫలితాలు  కొత్త విషయాలు తెలియచేస్తున్నాయి.


పిల్లలు చిన్న తనం నుండే స్మార్ట్ వాడుతూ ఉంటే అది వారు పెద్ద అయ్యాక వారి మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది అని ఈ పరిశోధన తెలియ చేస్తూ ఉంది. 27,969 మంది యువకులపై ఈ సంస్థ పరిశోధన చేసి ఫలితాలను బయటపెట్టింది.  చిన్న వయసు లో స్మార్ట్ ఫోన్స్ ను అలవాటు చేసుకున్న పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురుకుంటున్నారు అని ఈ ఫలితాలు చెప్తున్నాయి. అంతే కాదు వీరిలో ఎక్కువగా ఆత్మ హత్య చేసుకోవాలి అనే భావన, ఎవరిమాట వినకుండా మొండిగా ఉండడం వంటి లక్షణాలు తో పాటు వీరు అందరికీ అతీతులు అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది అని పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి. ఈ లక్షణాలు మగ పిల్లలు లో కంటే ఆడపిల్లలో అధికం గా ఉన్నట్టు ఈ పరిశోధన తెలియచేస్తూ ఉంది.


అదేవిధంగా యుక్త వయసు వచ్చాక మొబైల్ వాడడం మొదలుపెట్టిన వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం, అందిరితో స్నేహం గా ఉండడం వంటి లక్షణాలు కనిపించాయి ఈ పరిశోధన చెప్తూ ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఇదే విధమైన ఫలితాలు వచ్చాయి. 


ఇప్పుడు ఈ ఫలితాలు మనల్ని పిల్లల మొబైల్ ఫోన్ వాడకం పై మరోసారి ఆలోచించేలా చేస్తున్నాయి. పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ దూరంగా ఉంచాలి అని ఈ పరిశోధన చెప్తూ ఉంది. 


పిల్లలు మాట వినకపోయిన, అన్నం తినకపోయినా మొదట వారి చేతిలో మొబైల్ ఫోన్స్ పెట్టడం వారికి అలవాటు చేస్తున్నాం. వారికి ఓపికగా చెప్పే ఓపిక కూడా నేటి తల్లితండ్రులు కు చాలా మందికి ఉండడం లేదు. 

చిన్నతనం నుండి కంటి సమస్యలు నేటి పిల్లల లో గమనిస్తూనే ఉన్నాం. గతం లో పిల్లలు ఆరుబయట ఆటలు ఆడుకునే వారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లో గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు. పిల్లలు పార్క్ లో కూర్చుని కూడా స్మార్ట్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుతున్న వారు ఉన్నారు. దీనివలన శారీరక వ్యాయామం కూడా ఉండడం లేదు. దీనితో ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ లో గేమ్స్ ఆడి మానసిక రోగుల గా తయారైనా పిల్లల గురించి వింటూనే ఉన్నాం. అలాగే తెలిసి తెలియని వయసు లో తల్లితండ్రులు కు తెలియకుండా స్మార్ట్ గేమ్స్ కోసం డబ్బులు చెల్లించి పోగొట్టుకున్న సంఘటనలు వింటూ ఉన్నాము. 


మరోపక్క ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో రకరకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఆ మొబైల్స్ లో పిల్లలు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు అనేది కూడా తెలియడం లేదు. వారు అవి చూడడం ద్వారా ఏమి నేర్చుకుంటున్నారో చాలామంది తల్లితండ్రులు గమనించడం లేదు.

ఇప్పడు ఈ పరిశోధన ఫలితాలు పిల్లల మానసిక ఆరోగ్యం పై కూడా స్మార్ట్ ఫోన్ ప్రభావాన్ని చెప్తూ ఉంది. 


పిల్లలకు స్మార్ట్ ఫోన్ దూరంగా ఉంచడం , వారికి వీలైనంత ఎక్కువగా పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. వారికి నీతి కధలు చెప్తూ ఉండాలి. దీనివలన వారి సృజనాత్మక శక్తి పెరుగుతుంది. శారీరక వ్యాయామన్ని అందించే ఆటలు ఆడించాలి. పిల్లల మొబైల్ ఫోన్స్ వాడకం పై ఇకనైనా తల్లి తండ్రులు బాధ్యత వహించకపోతే  వారి భవిష్యత్ ను మనమే చేతులారా నాశనం చేసిన వారు అవుతాం. 








Comments

Popular posts from this blog

నిత్యానందుడు కైలాశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా?

  Swamy nityananda united states of kailasa : అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసుల్లో ఇరుక్కుని మన దేశం విడిచి పారిపోయిన దేవుడు స్వామి  నిత్యానంద. తమిళనాడు కు చెందిన ఈ నిత్యానంద ఇక్కడ చేయని తప్పులు లేవు. ప్రముఖులు తో పరిచయాలు ను ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు కేసులు ఎదుర్కొన్నాడు. ఈ నిత్యానంద స్వామి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లే సమయానికి దేశంవిడిచి జంప్.  తానే దేవుడు అని ప్రకటించుకుని, తప్పులు చేసి కేసుల పెట్టాకా రాత్రి కి రాత్రి దేశం విడిచి పారిపోయాడు.  అమెరికాలో ఎక్కడో ఒక దీవి ని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. కైలాసం ఒక స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు స్వామి నిత్యానంద.  సొంత కరెన్సీ, జాతీయ పతాకం కూడా ప్రకటించుకున్నాడు. … ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు.  కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ స్వామి నిత్యానంద దేశానికి ఓ దేశం గా గుర్తింపు ఇచ్చింది. ఎందుకు గుర్తించింది? అసలు ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఈ కైలాస దేశాని ఉన్నాయా లేదా? అనేది కూడా చూడకుండానే గుర్తించింది.  ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద. హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల,

తప్పు ఎవరిది?

 విధ్యారంగం లో అద్భుతమైన అభివృద్ది. ప్రతీ ఏడాది గొప్ప గొప్ప ఫలితాలు. 100% పాస్ అయిన స్కూల్స్ ఎన్నో. చాలా మంచి విషయమే. కానీ ఇది అంతా నాణానికి ఒకవైపే. మరోపక్క తల్లి తండ్రులకు, విధ్యార్థులు కు వస్తున్న మార్కులతో, పెర్సంటేజ్ లతో సంతృప్తి ఉండడం లేదు. 9.9 వచ్చిన విధ్యార్థులు, తల్లి తండ్రులు కూడా అసంతృప్తి తో రగిలి పోతున్నారు. మార్కులు ఒక్కటే జీవితం కాదు  ఈ ఏడాది ఈ అసంతృప్తి కి లోనై  బలవంతం గా ప్రాణాలు తీసుకున్న విధ్యార్థులు ఎంతో మంది ఉన్నారు. పరీక్షలలో సరైన మార్కులు రాలేదని, పక్కవాడి కంటే తక్కువ వచ్చాయి అని, పరీక్షలలో ఫెయిల్ అయ్యామని,  తక్కువ మార్కుల వలన తల్లితండ్రులు మందలించారు అని ఇలా కారణం ఏదైనా కానీ ఫలితం మాత్రం బలవంతపు మరణమే. కుమారుడు కు పదవ తరగతి ఫలితాలు లో 9.5 వచ్చి నా,  తల్లి మొహం లో విచారం చూసి ధైర్యం చెప్పి , ఐనా మంచి మార్కులే వచ్చాయి కదా అని అంటే,  ఏమి మంచి మా చిన్నప్పటి చదువులు కాదు కదా 10/10 రావాలి అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అంతే కాదు మా బందువులలో చాలా మందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయి అని కుమిలి కుమిలి బాధ పడింది. ఆ తల్లి బాధ చూసి తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్

మార్గదర్శి ఇదీ చరిత్ర

 మార్గదర్శి అంటే నమ్మకానికి మారుపేరుగా తీర్చి దిద్దారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి ప్రారంభం చేసినపుడు చిటఫండ్స్ కు ఆదరణ లేదు. కానీ ముందుచూపుతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ను ప్రారంభం చేసి దానిని 60 ఏళ్ళు గా విజయపధం లో నడిపిస్తున్నారు రామోజీరావు.  మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్  అనే పేరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకునే పేరు. తెలుగు కుటుంబాల ఆర్ధిక ప్రణాళిక లో భాగం అయిన పేరు. ఎంతో మంది ఆర్ధిక విజయాలకు బాట వేసిన పేరు. ఎంతో మంది వ్యాపారస్తులకు ఆర్ధిక అలంబన అయిన పేరు. ప్రజలతో నిజాయితీ గా మమేకం అవ్వడమే ఈ విజయానికి కారణం.  తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ లు వెలిసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక బోర్డు తిప్పేసిన కధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక క్రమ శిక్షణతో ఖాతా దారుల నమ్మకాన్ని నిలబెడుతూ  60 ఏళ్లుగా ఒక్కక్క మెట్టు ఎక్కుతూ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేసిన చిట్ ఫండ్ సంస్థ ఒక్క మార్గదర్శి అని చెప్పవచ్చు. చెరుకూరి రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్శి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు తో ప్రారంభం అయ్యింది.