ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి . నిన్నటి వరకు ఉన్న ప్రజల ఆలోచనా విధానం లో మార్పులు వస్తున్నాయి . పవన్ కళ్యాణ్ ఒక బలమైన నాయకుడు గా నిలబడతాడు అని నిన్నటి వరకు భావించారు . వై ఎస్ ఆర్ సీపీ ప్రభుత్వ ఓటు ను జనసేన కొల్లగొడుతుంది అని విశ్లేషకులు అనుకున్నారు . ఐతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ , బిజెపి తో పొత్తు ఉంటుంది అని ప్రకటించడం తో జనసేన పార్టీ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము ఐయింది .
రాష్ట్రము లో తెలుగుదేశం పార్టీ ని నమ్మడానికి ప్రజలు సిద్ధం గా లేరు .అవసరాన్ని బట్టి మాటలు మార్చే చంద్రబాబు ఆలోచన ధోరణి తో ప్రజలు విసుగెత్తి పోయారు . పైగా చంద్రబాబు నోటు కు ఓటు కు సంబంధించిన అంశం ఇంకా ప్రజలు కూడా మర్చిపోలేదు . పైగా లోకేష్ పాద యాత్ర వలన పార్టీ కి ఒరిగింది ఏమీ లేకపోగా ప్రజలలో లోకేష్ పై పార్టీ పై విరక్తి వచ్చింది .
మత తత్వ చిచ్చు లు రేపి రాజకీయాలు చేసే బిజెపి ని కర్ణాటక లో ఓడించడం ద్వారా మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రజలు తరిమేశారు . ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలం అంతంతమాత్రం అది కూడా తెలుగుదేశం తో కలిస్తే , ఆ ఓట్లు కూడా రాలవు .
ఇక అధికారం లో ఉన్న వైస్సార్సీపీ పై ప్రభుత్వ వ్యతిరేఖ త అనేది ఎలానూ ఉంది . ఇటువంటి పరిస్థులలో ప్రజలు ప్రత్యామ్న్యాయం కోరుకుంటున్నారు . ఒక బలమైన నాయకుడు కోసం ఎదురు చూస్తున్నారు .
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి లో , పధకాల అమలులు పక్కనే ఉన్న తెలంగాణ తో పోల్చుకుని చూసుకుంటున్నారు . రైతు పక్షపాతి అయిన కేసీర్ తెలంగాణ లో అమలు పరుస్తున్న పధకాలు , పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చేయడం , దళారీ వ్యవస్థ ను అరికట్టడం వంటి వి ఆంధ్రప్రదేశ్ రైతులను , ప్రజలను ఆకర్షింప చేస్తున్నాయి . మరోపక్క కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ గా దేశం లో కూడా అధికారం లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు కూడా మేలు జరుగుతుంది . కేంద్రం నుండి రావాల్సిన ప్రత్యేక హోదా కూడా సాధించుకోవచ్చు అనే ఆలోచన ప్రజలలో ఉంది
కెసిఆర్ వంటి నాయకుడు కావాలని తపన పడుతున్నారు . కెసిఆర్ వంటి నాయకుడు ఉంటే ఈ పాటికే రాష్ట్రానికి రాజధాని వచ్చేదని ఆలోచిస్తున్నారు . రాష్ట్రము లో వైస్సార్ సిపి కి కెసిఆర్ మాత్రమే గట్టి పోటీ ఇవ్వగల నాయకుడు అని అనుకుంటున్నారు . రాష్ట్రం లో అధికార ప్రతి పక్షాల నుండి చాల మంది నాయకులూ భారతీయ రాష్ట్ర సమితి లో చేరడానికి సమయం కోసం వేచి చూస్తున్నారు . ఎన్నికల సమయం దగ్గర పడగానే ఇక భారతీయ రాష్ట్ర సమితి లోకి వలసలు ప్రారంభిస్తారు .
తెలంగాణ రాష్ట్ర సమితి , భారతీయ రాష్ట్ర సమితి గా మారి జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలి అని అడుగులు వేస్తూ ఉంది . భారతీయ రాష్ట్ర సమితి గా మారగానే తెలంగాణ పక్క నే ఉన్న మహారాష్ట్ర లో రాజకీయ వలసలు ప్రారంభం అయ్యాయి . మహారాష్ట్రలో కీలక నాయకులు భారతీయ రాష్ట్ర సమితి లో చేరుతున్నారు . అక్కడి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు . దీనికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రము లో కేసీర్ ప్రభుత్వం అమలు పరుస్తున్న పధకాలు . రైతుబంధు , దళిత బందు వంటివి పథకాలపై అక్కడి ప్రజలు ఎప్పటి నుండో ఆసక్తి కనబరుస్తున్నారు . ఇప్పుడు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా కనపడుతూ ఉంది . రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కెసిఆర్ కీలక భూమిక పోషించనున్నారు . ఈ అంశాన్ని గమనించిన రాష్ట్రము లో కొంతమంది అధికార పార్టీ నాయకులు వివిధ రకాలు గా తెలంగాణ మంత్రుల పై విరుచుకుని పడుతున్నారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో వివిధ ప్రాంతాలలో కె సి ఆర్ ను వ్యక్తిగతం గా ఇష్టపడే ప్రజలు ఎంతో మంది ఉన్నారు . వివిధ సందర్భాలలో కేసీఆర్ కు బ్యానర్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు . జాతీయ పార్టీ గా అడుగులు వేస్తున్న భారతీయ రాష్ట్ర సమితి ప్రస్తుతం ఒక్కక్క రాష్ట్రము లో పార్టీ ని కింది స్థాయి నుండి నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉంది . ప్రస్తుతం మహారాష్ట్ర లో వివిధ ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహించింది . త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా సభలు నిర్వహించే ఆలోచన లో భారతీయ రాష్ట్ర సమితి ఉంది అని వార్తలు వినబడుతున్నాయి .
కెసిర్ భారతీయ రాష్ట్ర సమితి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనాలకు వేదికగా మారనుంది అని విశ్లేషకుల అభిప్రాయం .
Comments
Post a Comment