Skip to main content

అక్కడ ఆలా ఇక్కడ ఇలా!

 తెలంగాణ  ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది. జూన్ 2 వతేది నుండి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపోందించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు ఉండబోతున్నాయి. అన్ని రంగాలలో సాధించిన ప్రగతి ని పల్లె పల్లె లో ప్రజలను భాగస్వాములు చేస్తూ సంబురాలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఈ తొమ్మిది ఏండ్ల లో సాధించిన ప్రగతి కి చిహ్నం గా ఈ దశాబ్ది ఉత్సవాలు ఉండనున్నాయి.


ఒక పక్క ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు కు ఏర్పాట్లు చేస్తుంటే ప్రతి పక్షాలు మొసలి కన్నీరు కార్చడం ప్రారంభించాయి. భారతీయ జనతా పార్టీ ఈ దశాబ్ది ఉత్సవాలు వలన భారత రాష్ట్ర సమితి కి రాజకీయ లబ్ది చేకూరుతుంది అని, ప్రజాధనం వృధా అయిపోతుంది అని విమర్శలు చేస్తూ ఉంది.


ఆత్మగౌరవానికి కోసం ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పదవ వసంతం లోకి అడుగుపెడుతున్న వేళ సంబురాలు చేసుకోవడం తప్పేముంది.  ఒకవేళ ఈ సంబురాలు వలన భారతీయ రాష్ట్ర సమితి కి రాజకీయ లబ్ది చేకూరుతుంది అనుకుంటే అది ఎందుకు చేకూరుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి.


ఈ దశాబ్ది ఉత్సవాలాలో తెలంగాణ ప్రభుత్వం తాను చేసిన అభివృద్ధి చెప్పినందుకు రాజకీయ లబ్ది చేకూరుతుంది అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుందా లేదా తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసి తెలంగాణ వచ్చే వరకు పోరాడిన కె సి ఆర్ ను ప్రజలు గుర్తు పెట్టుకోవడం వలన లబ్ది చేకూరుతుంది అని భావిస్తుందా?  లేకుంటే రాష్ట్రం లో సాగు నీటి కష్టాలు లేకుండా కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టు గురించి ఈ ఊత్సవాల్లో ప్రజల ముందుకు తీసుకుని వెళ్లడం వలన లబ్ది చేకూరుతుంది అని బిజెపి మదన పడుతుందా? ఒకవేళ నిజంగా   వీటివలన రాజకీయ లబ్ది అనేది చేకూరితే అది తీసుకునే అర్హత పూర్తిగా భారతీయ రాష్ట్ర సమితికే ఉంటుంది.


తెలంగాణ లో ఈ తొమ్మిది ఏండ్ల లో దేశం లో ఎక్కడా జరగని అభివృద్ధి ని చేసి ప్రజల ముందు ఉంచడం ఏ విధంగా తప్పు? అభివృద్ధి చేయకుండా మాటలు తో, మీడియా మానేజ్మెంట్ తో నెగ్గుకుని వస్తున్న ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ మాటలతో కాకుండా చెప్పినదానిని ఆచరణలో పెట్టి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. అభివృద్ధి ఫలాలు ను ప్రజలకు అందించింది. 


ఈ తొమ్మిది ఏండ్ల లో జరిగిన అభివృద్ది ని చూసి ప్రజలు మళ్ళీ భారతీయ రాష్ట్ర సమితి కి పట్టం కడతారని భారతీయ జనతా పార్టీ కి అప్పుడే భయం ప్రారంభం అయింది అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ దశాబ్ది ఉత్సవాలు నుండి ప్రజల ద్రుష్టి ని మరల్చడానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు కూడా ప్రారంభంచింది. రాబోయే ఎన్నికలలో భారతీయ రాష్ట్ర సమితి అన్ని పార్టీ లతో కలిసి పోటీ చేస్తుంది అని ప్రచారం చేస్తూ ఉన్నారు బిజెపి నాయకులు.


పక్క నే ఉన్న ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం లో అధికారం లో ఉన్న జగన్ ను రాబోయే ఎన్నికలలో ఓడించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడపోతున్నాయి అని వార్తలు వస్తున్నాయి.  భారతీయ జనతా పార్టీ  ఏ పార్టీ లతో అయిన కూటమిగా ఏర్పడవచ్చు కానీ ఇతర పార్టీ లు ఏ పార్టీ లతో ను కలవకూడదు అని బిజెపి ఆలోచన గా అనిపిస్తూ ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు.


ఎన్ని ఆసత్య ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ముందు అవి ఏవి నిలబడవు. తప్పుడు ప్రచారాలు చేసే పార్టీ లకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.














Comments

Popular posts from this blog

నిత్యానందుడు కైలాశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా?

  Swamy nityananda united states of kailasa : అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసుల్లో ఇరుక్కుని మన దేశం విడిచి పారిపోయిన దేవుడు స్వామి  నిత్యానంద. తమిళనాడు కు చెందిన ఈ నిత్యానంద ఇక్కడ చేయని తప్పులు లేవు. ప్రముఖులు తో పరిచయాలు ను ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు కేసులు ఎదుర్కొన్నాడు. ఈ నిత్యానంద స్వామి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లే సమయానికి దేశంవిడిచి జంప్.  తానే దేవుడు అని ప్రకటించుకుని, తప్పులు చేసి కేసుల పెట్టాకా రాత్రి కి రాత్రి దేశం విడిచి పారిపోయాడు.  అమెరికాలో ఎక్కడో ఒక దీవి ని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. కైలాసం ఒక స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు స్వామి నిత్యానంద.  సొంత కరెన్సీ, జాతీయ పతాకం కూడా ప్రకటించుకున్నాడు. … ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు.  కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ స్వామి నిత్యానంద దేశానికి ఓ దేశం గా గుర్తింపు ఇచ్చింది. ఎందుకు గుర్తించింది? అసలు ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఈ కైలాస దేశాని ఉన్నాయా లేదా? అనేది కూడా చూడకుండానే గుర్తించింది.  ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద. హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల,

తప్పు ఎవరిది?

 విధ్యారంగం లో అద్భుతమైన అభివృద్ది. ప్రతీ ఏడాది గొప్ప గొప్ప ఫలితాలు. 100% పాస్ అయిన స్కూల్స్ ఎన్నో. చాలా మంచి విషయమే. కానీ ఇది అంతా నాణానికి ఒకవైపే. మరోపక్క తల్లి తండ్రులకు, విధ్యార్థులు కు వస్తున్న మార్కులతో, పెర్సంటేజ్ లతో సంతృప్తి ఉండడం లేదు. 9.9 వచ్చిన విధ్యార్థులు, తల్లి తండ్రులు కూడా అసంతృప్తి తో రగిలి పోతున్నారు. మార్కులు ఒక్కటే జీవితం కాదు  ఈ ఏడాది ఈ అసంతృప్తి కి లోనై  బలవంతం గా ప్రాణాలు తీసుకున్న విధ్యార్థులు ఎంతో మంది ఉన్నారు. పరీక్షలలో సరైన మార్కులు రాలేదని, పక్కవాడి కంటే తక్కువ వచ్చాయి అని, పరీక్షలలో ఫెయిల్ అయ్యామని,  తక్కువ మార్కుల వలన తల్లితండ్రులు మందలించారు అని ఇలా కారణం ఏదైనా కానీ ఫలితం మాత్రం బలవంతపు మరణమే. కుమారుడు కు పదవ తరగతి ఫలితాలు లో 9.5 వచ్చి నా,  తల్లి మొహం లో విచారం చూసి ధైర్యం చెప్పి , ఐనా మంచి మార్కులే వచ్చాయి కదా అని అంటే,  ఏమి మంచి మా చిన్నప్పటి చదువులు కాదు కదా 10/10 రావాలి అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అంతే కాదు మా బందువులలో చాలా మందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయి అని కుమిలి కుమిలి బాధ పడింది. ఆ తల్లి బాధ చూసి తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్

మార్గదర్శి ఇదీ చరిత్ర

 మార్గదర్శి అంటే నమ్మకానికి మారుపేరుగా తీర్చి దిద్దారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి ప్రారంభం చేసినపుడు చిటఫండ్స్ కు ఆదరణ లేదు. కానీ ముందుచూపుతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ను ప్రారంభం చేసి దానిని 60 ఏళ్ళు గా విజయపధం లో నడిపిస్తున్నారు రామోజీరావు.  మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్  అనే పేరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకునే పేరు. తెలుగు కుటుంబాల ఆర్ధిక ప్రణాళిక లో భాగం అయిన పేరు. ఎంతో మంది ఆర్ధిక విజయాలకు బాట వేసిన పేరు. ఎంతో మంది వ్యాపారస్తులకు ఆర్ధిక అలంబన అయిన పేరు. ప్రజలతో నిజాయితీ గా మమేకం అవ్వడమే ఈ విజయానికి కారణం.  తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ లు వెలిసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక బోర్డు తిప్పేసిన కధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక క్రమ శిక్షణతో ఖాతా దారుల నమ్మకాన్ని నిలబెడుతూ  60 ఏళ్లుగా ఒక్కక్క మెట్టు ఎక్కుతూ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేసిన చిట్ ఫండ్ సంస్థ ఒక్క మార్గదర్శి అని చెప్పవచ్చు. చెరుకూరి రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్శి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు తో ప్రారంభం అయ్యింది.