Skip to main content

లక్ష్యానికి చేరువలో కంటి వెలుగు

 


ఏ ప్రభుత్వానికి అయిన ప్రాధమిక లక్ష్యం ప్రజా ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సు.  

వీటిని ప్రజలకు అందించిన ప్రభుత్వాలు  ప్రజలు మనసు దోచుకో గలుగుతాయి. పది కాలాలు పాటు పరిపాలించగలుగుతాయి. ఆలా పరిపాలన అందించిన నాయకులు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తారు. ఇది నగ్న సత్యం. 


దేశం లో ఎక్కడా లేని విధంగా గా వినూత్న రీతిలో సంక్షేమ పధకాలు చేపట్టడం లో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంటుంది.  ప్రజా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టే పధకాలు కేవలం అరంభ సూరత్వం గా కాకుండా వాటి ఫలితాలు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ చేరాలి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ర్ ఆలోచన తో రాష్ట్రం లో ఎన్నో పధకాలు చిగురించి వికసిస్తూ ఉన్నాయి.



సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అనే మాట మనకందరికీ తెలిసిందే. అంటే అన్ని ఇంద్రియాలలో కళ్ళు ఎంతో ముఖ్యమైనవి. దీనిని ద్రుష్టి లో పెట్టుకుని రాష్ట్రం లో ఆంధత్వం అనేది లేకుండా చేయాలి అనే లక్ష్యం తో ప్రజల్లోకి తీసుకుని వచ్చిన పధకం కంటి వెలుగు. ఇప్పటిదాకా ఈ పధకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. కంటి సమస్యలు ఉన్నవారిని పరీక్ష చేయడం, అవసరమైన వారికి కంటి అద్దాల పంపిణీ, కంటి ఆపరేషన్లు నిర్వహణ, కంటి సమస్యలు రాకుండా  అవసరమైన మందుల పంపిణీ, కంటి సమస్యల పై అవగాహన కల్పించడం ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యం. కేవలం ఒక్క ఆధార్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పూర్తి ఉచితం గా ఈ సేవలు అన్నీ కంటి వెలుగు లో లభిస్తున్నాయి. 


రాష్ట్రం లో ఆంధత్వ  నివారణ ముఖ్య లక్ష్యం గా ప్రారంభిన కంటి వెలుగు పధకం తన లక్ష్యానికి చేరువలో ఉంది.


మొదటి విడత గా మెదక్ జిల్లా మల్కాపూర్ లో 2018 ఆగష్టు 15 వ తేదీ న ఈ పధకం ప్రారభించడం జరిగింది. దాదాపు 8 నెలల లో కోటి యాభై లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా తన లక్ష్య సాధనలో ముందు అడుగు వేసింది. అంతే కాకుండా 50 లక్షల మందికి ఉచిత కళ్ళ అద్దాలు మొదటి విడత లో అందించింది తెలంగాణ సర్కార్.


తదుపరి  2023 జనవరి 18న రెండవ విడత కంటి వెలుగు కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇప్పటివరకు సుమారు కోటి యాభై లక్షలు మందికి కంటి పరీక్షలు, 21 లక్షల మంది కి అవసరమైన కంటి అద్దాలు అందించింది  ఈ పధకం. ఈ విడత పూర్తి అయ్యేసరికి సుమారు రెండు కోట్ల మంది ప్రజలు ఈ పధకం ద్వారా లబ్ది పొందుతారు.


ఎంతో మంది పేద వారు వైద్యానికి అయ్యే ఖర్చు భరించలేక, దూరంగా ఉండే పట్టణాలకి వైద్యం కోసం వెళ్లలేక  కళ్ళు కనపడక పోయినా అలానే జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు. అలాంటి వారికోసం గ్రామాలలోనే కంటి వెలుగు శిభిరాలు నిర్వహించి కంటి పరీక్షలు చేస్తున్నారు. చూపు మందగించిన వారికి అవసరమైన వైద్యం చేస్తున్నారు.


నేను వ్యక్తి గతం గా ఈ పధకం అమలు గురించి చాలా మంది తో మాట్లాడాను. ఎవరిని కదిపినా ఈ కంటి వెలుగు పధకం గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా వీరి మాటలు ద్వారా తెలుసుకున్న మరో అంశం ఏమిటంటే, ఒకవేళ వైద్య పరీక్షల సమయం లో పెషేంట్ కి సరిపోయే కళ్ళ అద్దాలు అందుబాటులో లేకపోతే తదుపరి పదిహేను రోజుల్లో ఆశా వర్కర్స్ ద్వారా పెషేంట్ ఇంటికే ఆ కళ్ళ అద్దాలు పంపడం.  మరోసారి కంటి సమస్య ఉన్నవారు వైద్యుల చుట్టూ తిరగకుండా చేసిన ఈ ఏర్పాటు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.


 కేవలం తెలంగాణ రాష్ట్రం లోనే ఇటువంటి పధకం ఇంత విజయవంతం గా నిర్వహించ బడుతూ ఉంది. ప్రభుత్వ వైద్యులు, అధికారులు ఎంతో అకింతభావంతో ఇందులో పాల్గొంటూ ఈ పధకాన్ని విజయవంతం చేస్తున్నారు. 



ఈ విడత  పూర్తి అయ్యేసరికి సుమారు రెండు కోట్ల మంది జీవితాల్లో 'కంటి వెలుగు' వెలుగులు నింపుతుంది.

 


ఒక మంచి ఆలోచన సమాజం లో మార్పు తీసుకుని వస్తుంది. ఎంతో ముందు చూపుతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న ఈ కంటి వెలుగు రాబోయే రోజుల్లో  మరింత మంది జీవితాల్లో వెలుగులు నింపాలి అని మనసారా ఆకాంక్షిద్దాం.


Comments

Popular posts from this blog

నిత్యానందుడు కైలాశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా?

  Swamy nityananda united states of kailasa : అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసుల్లో ఇరుక్కుని మన దేశం విడిచి పారిపోయిన దేవుడు స్వామి  నిత్యానంద. తమిళనాడు కు చెందిన ఈ నిత్యానంద ఇక్కడ చేయని తప్పులు లేవు. ప్రముఖులు తో పరిచయాలు ను ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు కేసులు ఎదుర్కొన్నాడు. ఈ నిత్యానంద స్వామి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లే సమయానికి దేశంవిడిచి జంప్.  తానే దేవుడు అని ప్రకటించుకుని, తప్పులు చేసి కేసుల పెట్టాకా రాత్రి కి రాత్రి దేశం విడిచి పారిపోయాడు.  అమెరికాలో ఎక్కడో ఒక దీవి ని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. కైలాసం ఒక స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు స్వామి నిత్యానంద.  సొంత కరెన్సీ, జాతీయ పతాకం కూడా ప్రకటించుకున్నాడు. … ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు.  కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ స్వామి నిత్యానంద దేశానికి ఓ దేశం గా గుర్తింపు ఇచ్చింది. ఎందుకు గుర్తించింది? అసలు ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఈ కైలాస దేశాని ఉన్నాయా లేదా? అనేది కూడా చూడకుండానే గుర్తించింది.  ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద. హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల,

తప్పు ఎవరిది?

 విధ్యారంగం లో అద్భుతమైన అభివృద్ది. ప్రతీ ఏడాది గొప్ప గొప్ప ఫలితాలు. 100% పాస్ అయిన స్కూల్స్ ఎన్నో. చాలా మంచి విషయమే. కానీ ఇది అంతా నాణానికి ఒకవైపే. మరోపక్క తల్లి తండ్రులకు, విధ్యార్థులు కు వస్తున్న మార్కులతో, పెర్సంటేజ్ లతో సంతృప్తి ఉండడం లేదు. 9.9 వచ్చిన విధ్యార్థులు, తల్లి తండ్రులు కూడా అసంతృప్తి తో రగిలి పోతున్నారు. మార్కులు ఒక్కటే జీవితం కాదు  ఈ ఏడాది ఈ అసంతృప్తి కి లోనై  బలవంతం గా ప్రాణాలు తీసుకున్న విధ్యార్థులు ఎంతో మంది ఉన్నారు. పరీక్షలలో సరైన మార్కులు రాలేదని, పక్కవాడి కంటే తక్కువ వచ్చాయి అని, పరీక్షలలో ఫెయిల్ అయ్యామని,  తక్కువ మార్కుల వలన తల్లితండ్రులు మందలించారు అని ఇలా కారణం ఏదైనా కానీ ఫలితం మాత్రం బలవంతపు మరణమే. కుమారుడు కు పదవ తరగతి ఫలితాలు లో 9.5 వచ్చి నా,  తల్లి మొహం లో విచారం చూసి ధైర్యం చెప్పి , ఐనా మంచి మార్కులే వచ్చాయి కదా అని అంటే,  ఏమి మంచి మా చిన్నప్పటి చదువులు కాదు కదా 10/10 రావాలి అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అంతే కాదు మా బందువులలో చాలా మందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయి అని కుమిలి కుమిలి బాధ పడింది. ఆ తల్లి బాధ చూసి తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్

మార్గదర్శి ఇదీ చరిత్ర

 మార్గదర్శి అంటే నమ్మకానికి మారుపేరుగా తీర్చి దిద్దారు రామోజీరావు. 1962 లో మార్గదర్శి ప్రారంభం చేసినపుడు చిటఫండ్స్ కు ఆదరణ లేదు. కానీ ముందుచూపుతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ను ప్రారంభం చేసి దానిని 60 ఏళ్ళు గా విజయపధం లో నడిపిస్తున్నారు రామోజీరావు.  మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్  అనే పేరు తెలుగు వారు ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకునే పేరు. తెలుగు కుటుంబాల ఆర్ధిక ప్రణాళిక లో భాగం అయిన పేరు. ఎంతో మంది ఆర్ధిక విజయాలకు బాట వేసిన పేరు. ఎంతో మంది వ్యాపారస్తులకు ఆర్ధిక అలంబన అయిన పేరు. ప్రజలతో నిజాయితీ గా మమేకం అవ్వడమే ఈ విజయానికి కారణం.  తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ లు వెలిసి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక బోర్డు తిప్పేసిన కధలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక క్రమ శిక్షణతో ఖాతా దారుల నమ్మకాన్ని నిలబెడుతూ  60 ఏళ్లుగా ఒక్కక్క మెట్టు ఎక్కుతూ మూడు రాష్ట్రాలలో విజయకేతనం ఎగరవేసిన చిట్ ఫండ్ సంస్థ ఒక్క మార్గదర్శి అని చెప్పవచ్చు. చెరుకూరి రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్శి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు తో ప్రారంభం అయ్యింది.